పై టైటిల్ చూసి మెగా పొలిటికల్ స్టార్ హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ ల పై ఫైర్ అయిపోతున్నాడు అనుకోకండి. ఇది వేరే స్టొరీ. భాగ్యనగరంలో మల్టీ డైమెన్షన్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థ అధినేత పేరు రామ్ మోహన్. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ లను హీరోగా పెట్టి ఒక సినిమాను నిర్మిస్తున్నాడు అయితే ఈ సినిమాకు ఈమధ్యనే ‘చెర్రీ – బన్నీ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయి౦ఛి టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు.

ఈ విషయం మొదటిగా మన మెగాస్టార్ చిరంజీవి కి చేరి ఆయన బావమరది అల్లు అరవింద్ ద్రుష్టి దాకా వెళ్ళడం తో ఖంగారుపడ్డ ఈ మెగా కుటుంబ పెద్దలు అల్లు అరవింద్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్న రామ్ మోహన్ కు కబురు పెట్టి ఈ సినిమా టైటిల్ ను మార్చుకోమని కోరారట. దీనికి కారణంగా ‘చెర్రీ – బన్నీ’ లు అంటే ఆంధ్రదేశం అంతటా రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లే గుర్తుకు వస్తాయి కాబట్టి ఈ పేర్లతో టైటిల్ కాకుండా మరేదైనా పేరుతో టైటిల్ పెట్టుకోమని అల్లు అరవింద్ సున్నితంగా సూచించాడట. ఈమాటలకు సదరు నిర్మాత రామ్ మోహన్ మరింత సున్నితంగా చెర్రీ  -బన్నీ లు అంటే ట్రేడ్ మార్క్ నేమ్స్ కావు కదా అంటూ అతితెలివిగా ప్రశ్నించడంతో నిర్ఘాంతపోయిన అల్లు అరవింద్ ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలా అనే విషయం పై తలపట్టుకుంటున్నాడట.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి అయిపోయిన ఈ సినిమాను రామ్ చరణ్, అల్లు అర్జున్ లు నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల అయ్యే అక్టోబర్ నెలలోనే విడుదల చేద్దామని ఈ నిర్మాత ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఈ విషయాన్ని ఏదో విధంగా పరిష్కరించమని చిరంజీవి అరవింద్ కు చెప్పడమే కాకుండా, చెర్రీ- బన్నీ టైటిల్ పై కోపంగా ఉన్నాడు అనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తూ హాట్ టాపిక్ గా మారాయి. చివరకు ఈ చెర్రీ – బన్నీ కధ సుకాంతం అవుతుందో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: