హైదరాబాద్, దిల్షుక్నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంఘటనను ఎవరూ అంత త్వరగా మరిపోలేరు. ఈ సంఘటనలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనకు చలించిన సమంత ప్యాన్ యాభై వేల రూపాయలను ఆ సంఘటనలో కాలును పోగొట్టుకున్న విద్యార్ధినికి అందజేశారు. కాలు పోగొట్టుకున్న ఆ అమ్మాయి రజిత. తను ఎంబిఎ స్టూడెంట్. సంమంత ఫ్యాన్, ఆ చెక్ను సమంతాతో ఇప్పించాడు. తన అభిమాని చేస్తున్న ఈ సహాయానికి చలించి, నేను తగింత సహాయం చేస్తాను అని మాటిచ్చింది. ఆ విధంగానే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంది. రజితకు కృత్రిమ కాలును అమర్చటానికి దాదాపు 2,30,000 అవసరం ఉంటుంది. అంత అమౌంట్ను రజితకు అందజేసింది ఈ అందాల తార సమంత. దీనికి సంబంధించిన చెక్ను ఫ్యాన్స్ ద్వార ఇచ్చింది.
టాలీవుడ్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవటానికి సమంత సినిమా పరంగాఎంతో కష్టపడుతుంది. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలతో అభిమాలను హృదాయలనే కాకుండా సామాన్య ప్రజల మదిని, తన ఉదార హృదయంతో దోచుకుంటుంది. సమంత చేసిన ఈ సహాయం ఎంతో విలువైనదని టాలీవుడ్ సైతం భావిస్తుంది. ఎట్ ప్రెజెంట్ సమంత తన మూవీలతో బిజిబిజిగా ఉంటుంది. అత్తారింటికి దారేది మూవీలో పవన్ సరసన నటించిన సమంత, ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది.