పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ సీడీల అమ్మకం కోస్తాంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్నాయి అన్న వార్తలు మీడియా లో గుప్పుమనడం తో ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఎడిటింగ్ రూమ్ లో ఉన్న ఒక వ్యక్తి సహాయంతో ఈ పైరసీ జరిగిందని, అక్కడ నుండి ఈ లీక్ వీడియో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చేరుకొని పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలలో ఈ సినిమా పైరసీ సీడీల కలకలం మొదలు అయింది అని అంటున్నారు. ఈ వార్తల నేపధ్యంలో ఎలర్ట్ అయిన ఈ సినిమా నిర్మాతలు ‘అత్తారింటికి దారేది’ ని ఇంక ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా ఈనెల 27 వ తారిఖునాడే విడుదల చేద్దామని నిశ్చయి౦చు కున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ  వార్తల నేపథ్యంలో ఈ సినిమా  లో  హీరోయిన్‌గా నటించిన సమంత తన ట్విట్టర్ ద్వారా తెలుగు సినీ అభిమానులకు పలు విన్నపాలు చేసింది. ‘సినిమాను ఎంతో కష్టపడి చేసాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు నిర్మాతలు, ఒక మంచి సినిమా ఇలా విడుదలకు ముందు పైరసీ కావడం బాధాకరంగా ఉంది.

సినిమాకు మద్దతుగా నిలవండి, పైరసీని అరికట్టండి, సినిమాను విజయవంతం చేయండి' అంటూ ట్విట్టర్ ద్వారా  కొరుకొంది.  అత్తారింటికి దారేది పైరసీ సీడీల విషయం బయటకు తెలియగానే యాంటీ పైరసీ విభాగం అప్రమత్తమైంది అని అంటున్నారు. అదే విధం గా రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న పవన్ అభిమానులు కూడా ఈ పై రసి  లీకేజ్ వార్తల ఫై చాలాఆందోళన గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్  అభిమానులే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ సినిమా పైరసీ గండం నుండి గట్టు ఎక్కాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: