పవన్ కళ్యాణ్ తన ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ పై జరుగుతున్న రగడ కు చాలా షాక్ కు గురి అయ్యాడని, సాధారణంగా ఏ విషయాలకు స్పందించని పవన్ కళ్యాణ్, ఈ విషయం పై మీడియా ముందుకు వచ్చి ప్రతిస్పందిస్తాడని అంతేకాకుండా తన అభిమానులు అందరినీ ఈ పైరసీ సిడీలపై యుద్ధం చెయ్యమని పిలుపు ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో అత్తారింటికి దారేది ని ఈ వారమే విడుదల చేస్తారు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో నిజంగా మీడియా ముందుకు పవన్ వస్తే మీడియా వారు అడిగే రకరకాల ప్రశ్నలతో పాటు సమైఖ్య ఉద్యమం పై కూడా పవన్ కామెంట్స్ అడుగుతారు కాబట్టి పవన్ ఈ సాహసం చెయ్యడని, కేవలం పవన్ కళ్యాణ్ పేరుతో ఒక ప్రెస్ నోట్ మాత్రమే విడుదల అవుతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

సీమంధ్ర కు సంబంధించిన దాదాపు 8 మంది ఎంపీ లు రేపు లోక్ సభ స్పీకర్ ను కలిసి తమ రాజీనామాలు ఆమోధించుకుంటారు అనే వార్తలు రావడం తో పాటు రేపు సీమంధ్ర ప్రాంతం అంతా రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా బందు పాటిస్తున్న నేపధ్యంలో ఇంత హడావుడి గా పవన్ అత్తారింటికి దారేది ఎమర్జెన్సీ రిలీజ్ కార్యరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయా..? అనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో వినపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వార్తలపై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: