అత్తారింటికిదారేది లీక్డ్ మూవీపై టాలీవుడ్లో మందే సమాచారం ఉందా అనే విషయంపై అంటే పలు అనుమానాలు వస్తున్నాయంట. కొంత మంది మాత్రం ఇది ఖచ్చితంగా పబ్లిసిటి స్టంటే అంటున్నారు. మరి కొంత మంది మాత్రం ఆ న్యూస్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదంటున్నారు. పబ్లిసిటి కోసం అయితే తొంభై నిముషాల వీడియోను ఏ విధంగా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా నెట్లో పెట్టాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అత్తారింటికి దారేది మూవీ డిలే పడుతూ సినీ అభిమానుల వద్ద నెగిటివ్ టాక్ను తెచ్చుకునే పరిస్థితుల్లో ఉంది. అందుకే ఒక్కసారిగా హై ఎనర్జిటిక్ పబ్లిసిటి స్టంట్ను క్రియోట్ చేయాలంటే ఈ మాత్రం డ్యూరేషన్ ఉన్న వీడియో విడుదల చేయక తప్పదు అని టాలీవుడ్లోని ఓ వర్గం ఆరోపిస్తుంది.
త్వరలోనే తెలంగాణపై నోట్ పెట్టడం, అలాగే జగన్ బైయిల్పై క్లారిటి రావడం వంటి విషయాలు మూవీ రిలీజ్ నాడు, ఏ మాత్రం ప్రమోషన్ చేసుకోని విధంగా ఉంటాయి. వీటన్నింటికి సమాధానం చెప్పి, సినీ అభిమానులను అటెక్షన్ చేయాలి. అదే లీక్డ్ వీడియోగా బయటకు వచ్చిందంటున్నారు. ఈ విషయంలో కొందరు చాలా తెలివిగానూ, సో ఇంటెలిజెంట్గానూ ఈ తంతంగాన్ని నిర్వహించారని వాదన. ఏదైమైనా ఒక వేళ ప్రమోషన్ స్టాటజీ ప్రకారమే ఈ వీడియోను లీక్ చేస్తే అంతకు మించిన ఛీప్ ట్రిక్స్ ఇంకొంకటి ఉండదంటున్నారు. మొత్తానికి జరిగింది తప్పు కాబట్టి ఇకనైనా టాలీవుడ్ మేల్కొని నష్టనివారణకు గట్టి చర్యలను తీసుకోవాలంటున్నారు.