పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ పైరసీ బారిన పడడంతో ఈ విషయంపై ఎప్పుడూ వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకొనే టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఒకే బాటపైకి వచ్చి ఒకే మాటపై ఈ పైరసీ బూతాన్ని ఖండించడంమే కాకుండా చాలామంది హీరోలు, సెలబ్రిటీలు తమ ట్విట్టర్ లలో పవన్ కళ్యాణ్ కు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అయితే ఇంతమంది హీరోలు, సెలబ్రిటీలు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ విషయ౦పై ఒక ప్రముఖ సెలబ్రిటీ స్పందన గురించి ఎదురుచూశారు. అతడే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

గతంలో ప్రిన్స్ మహేష్ నటించిన ‘అర్జున్’ సినిమా పైరసీ బారిన పడినప్పుడు మహేష్ కు ప్రపధమంగా బహిరంగంగా మద్దతు తెలియజేసింది పవన్ కళ్యాణ్. పవన్ ప్రతిస్పందన తరువాత ఆనాడు చాలామంది హీరోలు మహేష్ కు బాసట గా నిలిచారు. ధాని తరువాత మహేష్ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ని ఈ విషయమై కలిసినప్పుడు చాలామంది హీరోలు మహేష్ వెంట నడిచారు. మహేష్ సినిమా సమస్యలలో ఉన్నప్పుడు పైరసీ కి వ్యతిరేకంగా బహిరంగంగా మద్దతు ప్రకటించడం ద్వారా ఎంతో మానసిక ధైర్యాన్ని అందజేసిన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది అదే పైరసీ సమస్యతో ఈ రోజు సమస్యలలో పడితే టాలీవుడ్ ప్రిన్స్ ఎందుకు మాట్లాడడంలేదు...? అంటూ పవన్ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారట. గతంలో పవన్ సినిమా ‘జల్సా’ కు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ అభిమానులకు కూడా మహేష్ అంటే చాలా ఇష్టం. మహేష్ సినిమాలను పవర్ స్టార్ అభిమానులు చాలా ఇష్టపడి చూస్తూ ఉంటారు.

ఇటువంటి పరిస్థితులలో మహేష్ ను అభిమానించే పవర్ స్టార్ అభిమానులకు ధైర్యం కలిగించే విధంగా మహేష్ ఎటువంటి స్పందన ఇవ్వకుండా ఇలా మౌన ముద్ర ఎందుకు వహించాడు అంటూ పవర్ స్టార్ అభిమానులు మహేష్ పై కోపం గా ఉన్నారని టాక్. కనీసం తన ట్విట్టర్ ద్వారా అయినా పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలియజేస్తూ రెండు వాక్యాలు రాస్తే మహేష్ ఇమేజ్ ఏమీ తగ్గిపోతు కదా అంటూ మధన పడుతున్నారట పవన్ అభిమానులు. వివాదాలకు దూరంగా ఉండే మన టాలీవుడ్ ప్రిన్సు మరి పవన్ అభిమానుల కోరికను మన్నిస్తాడా..? లేకుంటే ఇదే మౌన ముద్రను కొనసాగిస్తాడా...? అంటూ మహేష్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మౌనం వెనుక అర్ధం ఏమిటో మహేష్ కే తెలియాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: