భారత సినిమా చరిత్రలో ఆ రికార్డును తిరగరాసే దమ్మున్న హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకే ఉన్నందంటున్నారు సినివిశ్లేషకులు. అందరికి తెలుసు బాక్సాఫీసు వద్ద బద్దలు చేసే కలెక్షన్లు సంపాందించడంలో బాలీవుడ్ ను మించింది లేదు, ఆతర్వాత స్థానం టాలీవుడ్ దే.

టాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బద్దలు చేసే పవర్ కూడా ఉన్న స్టార్లు కూడా పవన్, మహేష్ లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇప్పటికే బాక్సాఫీస్ కలెక్షన్ల రేంజీని 300 కోట్లకు తీసుకెల్లింది. కాని టాలీవుడ్ ఇంకా వంద కోట్లకు కూడా చేరుకోలేదు. ఇప్పటి వరకు మగధీర ద్వారా రాంచరణ్ కొల్లగొట్టిన 89 కోట్లే అధికం

ఇక పవన్ గబ్బర్ సింగ్ సాదించింది 65 కోట్లు, మహేష్ బాబు దూకుడు సాదించింది 60 కోట్లే. అయితే రికార్డు రాంచరణ్ మీదే ఉన్నా కూడా తాజాగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లకు వస్తున్న క్రేజి, ఇమేజి చూస్తే వందకోట్లకు తీసుకువెల్ల గల సత్తా, దమ్ము వీరిద్దరికే ఉందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: