బాల‌కృష్ణ అప్‌క‌మింగ్ ఫిల్మ్ లెజెండ్  కోసం మ్యూజిక్ డైరెక్టర్ క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేస్తున్నాడు. సింహా మూవీ స‌క్సెస్‌కు మ్యూజిక్ కూడ ప్లస్ పాయింట్ కావ‌డంతో, అదే కాంబినేష‌న్ నుండి రాబోతున్న లెజెండ్ మూవీ కోసం, దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. సింహా మూవీకు మ్యూజిక్‌ను అందించిన చ‌క్రిను కాద‌న‌కొని, దేవిశ్రీప్రసాద్‌ను ఈ మూవీకు పెట్టుకున్నాడు డైరెక్టర్ బోయ‌పాటి. బాల‌కృష్ణ మూవీకు మొద‌టి సారిగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. యో యో మ్యూజిక్‌తో యూత్‌ను ఉర‌క‌లెత్తించే దేవిశ్రీ, నంద‌మూరి సింహం బాల‌కృష్ణకు ఏ విధమైన మ్యూజిక్‌ను అందిస్తాడో అని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంతా ఎంతో క్యూరియాసిటితో ఎదురుచూస్తుంది. 

బాల‌య్య లెజెండ్ మూవీ కోసం దేవిశ్రీ రాత్రి స‌మ‌యాల్లో ట్యూన్స్ క‌డుతున్నట్టు స‌మాచారం. ఇప్పటి వ‌ర‌కూ దాదాపు చాలా ట్యూన్స్‌ను రెడీ చేశాడ‌ని దేవిశ్రీ బృందం నుండి అందిన స‌మాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న లెజెండ్ మూవీకు సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చుహన్ లు బాల‌కృష్ణ స‌ర‌స‌న‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముఖ్యంగా బోయ‌పాటి ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ధను వ‌హిస్తున్నాడు. బాల‌య్య కోసం ప్రత్యేక‌మైన కాస్ట్యూమ్స్‌,బైకులల‌తో పాటు ప‌వ‌న్ ఫుల్ డైలాగుల‌ను కూడ రెడీ చేసుకున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: