రచయిత గా కెరియర్ ప్రారంభించి, దర్శకుడిగా ఎదిగిన వాళ్ళు టాలీవుడ్ పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వారిలో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లను ప్రముఖంగా పేర్కొనవచ్చు. కాని మరో రచయిత కూడా ఈ ప్రముఖుల చెంత చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడే వీరుపోట్ల. హీరో నాగార్జునతో ‘రగడ’ సినిమాను మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిద్దామని ప్రయత్నించినా, ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేకపొయింది. అలాగే మంచు మనోజ్ తో ‘బిందాస్’ నిర్మించి ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకొని పాస్ మార్కులతో బయటకు వచ్చాడు.

దానితరువాత వీరుపోట్ల కు చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమీ టాలీవుడ్ లో రాలేదు. దీనితో మళ్ళీ తనకు పాస్ మార్కులు వచ్చిన మంచు కుటుంబాన్నే నమ్ముకొని ఈసారి విష్ణు తో ‘దూసుకేళ్తా’ అంటూ వస్తున్నాడు. ఈ సినిమా పాటలు మొన్న శనివారం భాగ్యనగరంలో విడుదల అయ్యాయి. ఈ సినిమా టీజర్, పాటలు పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నా, ఈ దసరా కి ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా తో పోటీ గా తీసుకురావడం టాలీవుడ్ లో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మంచు విష్ణు కు కలిసివచ్చిన పండుగగా దసరా పండుగ సెంటిమెంట్ రిత్యా బాగున్నా, ఇప్పటికే అనేక భారీ అంచనాలతో దూసుకువస్తున్న రామయ్యా వస్తావయ్యా తో ఈ సినిమాను పోటీ గా తీసుకురావడం అటు విష్ణు కెరియర్ కి కాని ఇటు వీరుపోట్ల కెరియర్ కి మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా దర్శకుడు వీరుపోట్ల మితిమీరిన సాహసం చేస్తున్నాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల తరువాత వీరుపోట్ల మంచు మనోజ్ తో బిందాస్ సీక్వెల్ చేస్తాడట. దీనిని బట్టి చూస్తే దర్శకుడు వీరు మంచు వారి కాంపౌండ్ కు బందీగా మారిపోయాడా..? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: