టాలీవుడ్ టాప్ టెన్ నిర్మాతల్లో అశ్వినీదత్ ఒకరు. తన వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద సూపర్ హిట్ సినిమాలను తీసిన ఘనత ఆయనది. అయితే గత కొన్నాళ్లుగా కాస్త స్లో అయ్యారీయన. దిల్ రాజు, బండ్ల గణేశ్ లాంటి కుర్ర నిర్మాతలు దూసుకురావడంతో కొంచెం వెనకబడ్డారు. అయితే ఇప్పటికీ ఆయనకు స్టార్ హీరోల సినిమాలు తీసే సత్తా ఉంది. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే మాత్రం, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనిపిస్తోంది.

తాజాగా అశ్వినీదత్ తీసుకున్న ఓ నిర్ణయం గురించి వింటే షాక్ తినక తప్పదు. ఆ నిర్ణయం ఏమిటో తెలుసా...? మెహర్ రమేశ్ డైరెక్షన్లో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు దత్. అసలే మెహర్ డిజాస్టర్లకు పెట్టింది పేరు. ఎంత పెద్ద హీరోకయినా ఓ అద్భుతమైన పరాజయాన్ని చవి చూపించగల సత్తా ఉన్నవాడు. ఎన్ని కోట్లు ఇచ్చినా చక్కగా దుర్వినియోగం చేయగల సమర్థుడు. అలాంటి వాడితో సినిమా తీయడానికి దత్ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. కథల ఎంపికలోనూ, జయాపజయాలను అంచనా వేయడంలోనూ మంచి అనుభవం ఉన్న అశ్వినీదత్ తీసుకోవాల్సిన నిర్ణయం కాదేమో ఇది అని సినీ పండితులు నిట్టూర్చుతున్నారు.

వీళ్లిద్దరూ కలసి పని చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో కంత్రి, శక్తి సినిమాలు వచ్చాయి. అవి రెండూ బాక్సాఫీసు వద్ద సృష్టించిన బీభత్సం గురించి ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండదు. అంతటి నష్టాన్ని మిగిల్చిన మెహర్ కి మళ్లీ ఏ ధైర్యంతో చాన్సిచ్చారో అశ్వినీదత్ కే తెలియాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: