గోవా సుందరి ఇలియానా ఈ మధ్య తెగ మీడియా కు ఎక్కుతోంది. అంతేకాదు ఒకప్పుడు తన కెరియర్ కు ఎంతో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ పై తెగ సెటైర్లు వేస్తోంది. ఆ మధ్య టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు విలువ లేదు అంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన ఇలీ బేబీ,  తను తెలుగు సినిమాలలోవరసపెట్టి నటించే రోజులలో ఒక హీరోపై తన మనసు పారేసుకున్నానని, అంతేకాదు ఆ హీరో యే తన సర్వస్వ౦ అనుకున్నానని, అయితే ఆ హీరో తనను మోసం చేశాడని, తెగ బాధపడిపోతోంది ఇలియానా.

దీనితో ప్రస్తుతం తన జీవితంలో ఎవరినీ నమ్మడం లేదని, ఒకసారి మోసపోయాను కాబట్టి ఇంక ఎవరినీ తన దరికి రానియ్యనని అంటూ ఈ మధ్య బాలీవుడ్ మీడియా ముందు తన బాధనంతా వెళ్లగక్కుకుంది ఇలియానా. అయితే ఆ టాలీవుడ్ హీరో పేరు మాత్రం చెప్పను కాక చెప్పను అంటోంది ఈ గోవా సుందరి. అంతేకాదు తాను ఎన్నో సినిమాలలో చేసినా తను నటించిన ఏడవ సినిమా పైనే తన మనసు ఉంటుందని అంటూ మరో మిసైల్ పేల్చింది ఇలియానా. ఇంతకీ ఆ ఏడవ సినిమా ఏమిటీ అంటే, నిర్మాత యం.ఎస్. రాజు నిర్మించిన ‘ఆట’ సినిమా అట.

ఈ సినిమాలో హీరో సిద్ధార్ద్ బాగానటించాడు అంటూ సిద్ధార్ద్ పై ప్రేమ ఒలకపోయడం చూస్తూ ఉంటే ఇంతకీ ఇలియానా ను మోసం చేసిన టాలీవుడ్ హీరో ఎవరు..? అలాగే పరాజయం పొందిన ఆట సినిమా, ఆ సినిమా హీరో సిద్ధార్ద్ పై ప్రత్యేక ప్రేమ ఏమిటి..? అన్న విషయాలు తెలియాలి అంటే మళ్ళీ మరోసారి ఇలియానా మీడియా ముందుకు వస్తే కాని వాస్తవాలు తెలియవు. ప్రస్తుతం ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి ఇలా మీడియాకు లీక్ లు ఇస్తూ రోజులు గడిపేస్తోంది ఇలీ బేబీ. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: