ఓపెనింగ్స్ తోనే కలెక్షన్లు తెచ్చుకోవడం సినీ పరిశ్రమలో ఇప్పడు సరికొత్త ట్రెండ్ అనే విషయం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి ఎక్కువ సంఖ్యలో ధియేటర్లలో విడుదల చేయడానికి అంతా మొగ్గు చూపుతున్నారు. ఇదే ఫార్ములాను ఇప్పడు అల్లరి నరేష్ కూడా ప్రయోగించాడు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సుడిగాడు చిత్రాన్ని ఇదే పద్దతిలో విడుదల చేసారు. భారీ పబ్లిసిటీ చేసి, ఎక్కువ ధియేటర్లలో విడుదల చేశారు. కాగా, అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అల్లరి నరేష్ సినిమాలలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సుడిగాడు నిలిచింది. జనం కూడా అల్లరి నరేష్ కామెడీకి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, సుడిగాడు కు సీక్వెల్ రూపొందిస్తున్నట్లు దర్శకుడు భీమినేని శ్రీనివాసరరావు ప్రకటించాడు. ఈ విషయం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా సుడిగాడు కు స్వీకెల్ రూపొందిస్తారా.. లేక వస్తున్న ఓపెనింగ్స్ ను నిలబెట్టుకోవడానికి చేస్తున్న కొత్త ప్రచారమా అని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: