టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన భాయ్ చిత్రంకు మొద‌టిలోనే ఝ‌ల‌క్‌ త‌ప్పలేదు. స‌మైక్యసెగతో భాయ్ చిత్రం ఆడియోవేడుక వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి భాయ్ మూవీ ఆడియో వేడుక రేపు జ‌ర‌గాల్సి ఉండ‌గా, స‌మైక్యాంద్ర  ఉద్యమం కార‌ణంగా, సీమాంద్రలోఆభిమానులు ఇక్కడ‌కు రాలేని ప‌రిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయ వేడి త‌ప్పితే మ‌రొక‌టి క‌నిపించ‌డంలేదు. ఈ స‌మయంలో ఆడియ వేడుక‌లకి అంత ఇంపార్టెన్స్‌గా జ‌నాలు తీసుకోరు. అందుకే మ‌రికొన్ని రోజులకి భాయ్ ఆడియో వేడుక‌ని వాయిదా వేసుకున్నారు. 

నాగార్జున ఈ మూవీను సొంత బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్నాడు. భాయ్ మూవీకు ప్రొడ్యూజ‌ర్ కం హీరో కాబ‌ట్టి మూవీ ప్రమోష‌న‌ల్ కార్యక్రమాల‌కు సంబంధించిన ప్రతి విష‌యంలోనూ నాగార్జున‌ చాలా జాగ్రత్త వ‌హిస్తున్నాడు. నాగార్జున గ‌త చిత్రాలు రిలీజ్‌ల విష‌యంలో చాలా గంద‌ర‌గోళం ఏర్పడింది. ఇప్పుడు భాయ్ సొంత చిత్రం కావ‌డంతో, ఈ మూవీపై ఎటువంటి నెగిటివ్ టాక్ రాకుండా జాగ్రత్త ప‌డుతున్నాడు. భాయ్ మూవీను డైరెక్ట్ చేసిన వీర‌భ‌ద్రమ్ కూడ ఈ మూవీను అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కించాడు. ప్రొడక్షన్ రూం నుండి ఈ మూవీపై మార్కెట్లోకి పాజిటివ్ టాక్ వెళ్ళింది. మొత్తానికి భాయ్ ఆడియో వేడుక వాయిదా ప‌డింది కాని మ‌ళ్ళి ఎప్పుడు అనేది త్వర‌లోనే తెలిసిద్దని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: