మెగా స్టారే పవన్ కళ్యాణ్ స్టార్ అన్న విషయం అందరికి తెలిసిందే, అయితే అనుకోని పరిణామాలు, మీడియా, గిట్టని వారి ఆరోపణల మద్య అది కాస్తా అర్థం మారి మెగాస్టారే పవన్ కు అసలైన విలన్ అన్న చందంగా కొంతకాలం నుంచి తీవ్రమైన ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఆ సందిగ్దతకు, గిట్టని వారు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చి దానికి తెరదించాడు అంటున్నారు సినీ, రాజకీయ పరిశీలకులు.

తాజాగా రెండు రోజుల క్రితం హిట్టయిన తన ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలో దీనికి కారకులైన వారందరికి కృతజ్ఞతలు తెలిపే సభ నిర్వహించారు. ఇప్పటి వరకు తన సినిమా ఫంక్షన్లలో కాని, ఏ ఇతర వేడుకల్లో గాని ఓటి రెండు మాటలు మాత్రమే మాట్లాడి ముగించుకునే పవన్ కళ్యాణ్ ఈ సభలో మైకు పట్టుకుని ఈ రోజు మీతో మాట్లాడిల్సింది చాలా ఉంది, నాకు  దానికోసం సమయం కావాలని అడగడం విశేషం.

ఈ మాటలన్న మరుక్షణమే ఆయన నోట నుంచి వచ్చిన మాటలు అందరిని కూడా ఉద్వేగానికి లోటు చేసాయంటున్నారు. కారణం ఆయన మాటలేంటో చూద్దాం.. ‘నాకు మా అమ్మనాన్నల ఆలనా పాలన అంతగా తెలియదు, నాకు అంతా నా అన్నయ్య, వదినలే. వారే నన్ను ఇంతటి వాన్ని చేసారు, చదువు అంతగా అబ్బని నాకు సినిమాల్లో టెక్నిషియన్ గా స్థిరపడాలన్న ఆలోచన ఉండేది, కాని వదిన ప్రోత్సాహంతోనే హీరోనయ్యాను, అన్నయ్య ఆలన, లాలన ప్రోత్సాహంతోనే ఇంతటి వాన్నయ్యాను’ అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే మెగాస్టార్ చిరంజీవి, ఆయన బార్య పవన్ కు తల్లీ, తండ్రి, గురువు,దైవం అని చెప్పి మామద్య ఆత్మీయతా అనుబందాలు విడదీయలేనివని చెప్పారు అంటున్నారు పరిశీలకులు. అంటే మెగాస్టారే పవన్ కు అసలైన పవర్ స్టార్ అన్న మాట.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: