బెంగాళీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వెండితెర మన్మధుడు నాగ్ తో ఆమె నటిస్తున్న ‘భాయ్’ సినిమా రిజల్ట్ చూడకుండానే రిచా తానిక సినిమా నిర్మాతలకు అందుబాటు లో ఉండను అంటూ ప్రకటనలు ఇస్తోంది.

ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రిచా తనకు సినిమా కెరియర్ మీద బోర్ కొట్టిందని, తాను త్వరలో అమెరికా వెళ్ళి ఒక బిజినెస్ స్కూల్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ డిగ్రీ చేసి ఒక మహిళా పారిశ్రామిక వేత్త లా మారిపోదామనుకుంటున్నానని ఈ ‘మిర్చి’ సుందరి చెపుతోంది. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని 2012 డిసెంబర్ లోనే ‘భాయ్’ సినిమా నిర్మాణంలో ఉండగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెపుతూ కమ్యూనికేషన్స, పబ్లిక్ రిలేషన్స్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన ఏదో ఒక వ్యాపార సంస్థను తన చదువు అయిన తరువాత ప్రారంభిస్తానని రిచా చెపుతోంది.
అంతేకాదు ‘లీడర్’ సినిమాలోని తను పోషించిన అర్చన పాత్ర లా తనకంటూ ఒక వ్యక్తిత్వంతో ఉండాలని ఉందని అంటూ భవిష్యత్ లో తన ఫోకస్ అంతా సినిమాలపై కన్నా బిజినెస్ స్కూల్ లో డిగ్రీ పైనే ఉంటుంది అంటూ రిచా చెప్పిన అనేక విషయాలు ఆ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఈరోజు ప్రచురించింది. నాగార్జున లాంటి టాప్ హీరోతో నటించిన భారీ బడ్జెట్ సినిమా రిజల్ట్ తెలియకుండానే రిచా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రకటించడం వెనుక కారణాలు ఏమిటో రిచా కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: