మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘బద్రీనాద్’ సినిమా తరువాత తన గీతా ఆర్ట్స్ బేనర్ పై సినిమాలు ఏమి తీయడం లేదు. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ డేట్స్ వచ్చే సంవత్సరానికి బ్లాక్ చేసిన తరువాత అరవింద్ పవన్- మురగదాస్ కాంబినేషన్ తో సినిమా వచ్చే సంవత్సరం తీద్దామని ఎంత ప్రయత్నించినా పవన్ తన మనసులోని మాటను బయట పెట్టక పోవడంతో మురగదాస్ డేట్స్ వృదా అవుతాయి అనే ఉద్దేశ్యంతో అరవింద్ మరగాదాస్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లతో వచ్చే సంవత్సరం ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పవన్ వరుస పెట్టి పరాజయాల పాలవుతున్న సమయంలో 2008 సంవత్సరంలో తన గీతా ఆర్ట్స్ పై ‘జల్సా’ నిర్మించి ఆరోజులలో పవన్ కు సూపర్ హిట్ అందించాడు. అదేవిధంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఆ సినిమా ఎమర్జెన్సీ రిలీజ్ కు సహకరించాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ – 2’ నిర్మాణంలో బిజీగా ఉన్న పవన్ ను ఈసినిమ పూర్తి ఐన తరువాత పవన్ కాల్ షీట్స్ తన గీతా ఆర్ట్స్ కు ఇమ్మని అడిగినా పవన్ వ్యూహాత్మక మౌనం వహించడమే కాకుండా తన ‘గబ్బర్ సింగ్ - 2’ నిర్మాణం ఒక దశకు వచ్చేవరకూ ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి వారు తీసే సినిమాను కూడా హోల్డ్ లో పెట్టాను అని చెప్పడంతో మురగదాస్ ఇచ్చిన డేట్స్ కు రామ్ చరణ్ తో సినిమాను అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందరో నిర్మాతలు పవన్ ఇంటి ముందు క్యూ కడుతున్నా తన బావను కూడా వైటింగ్ లిస్టు లో పెట్టిన స్థాయికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అంటు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: