ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్దకు క్షమించ‌మ‌ని త‌ప్పు చేసిన వాళ్ళు వ‌చ్చారంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ప‌వ‌న్ అత్తారింటికిదారేది మూవీను రిలీజ్ కంటే ముందుగానే కొంద‌రు వ్యక్తులు కావాల‌నే లీక్ చేసిన‌ట్టుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాడు. ప‌వ‌న్ వ‌ద్ద అధారాల‌తో స‌హా ఉన్నాయ‌ని కుట్ర చేసిన వ్వక్తుల‌కు అర్ధం అయింది. అయితే ఆ వ్వక్తి ఎవ‌ర‌న్నది కొంత మంది టాలీవుడ్ పెద్దల‌కు తెలిసిన‌ప్పటికీ ఆ మేట‌ర్‌ను బ‌య‌ట‌ల‌కు చెప్పటానికి చాలామంది నిరాక‌రిస్తున్నారు. త‌ప్పు చేసిన వ్వక్తులు మాత్రం ప‌వ‌న్ వ‌ద్దకు క్షమించాల‌ని కోరుతున్నట్లుగా స‌మాచారాన్ని అందిస్తున్నారంట‌. ఇది ప‌వ‌న్ మీద ప‌గ‌తో చేసిన కుట్ర ఒక‌టైతే, ఇండ‌స్ట్రీలో ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం అంద‌రిని క‌ల‌వ‌ర‌ప‌ర‌చడం మ‌రొక‌టి. ఏదిఏమైన ఆ లీక్డ్ వీడియోను చేసిన వారిని ప్రతి ఒక్కరూ ఛీద‌రించుకుంటున్నారంట‌. అందుకే ఆ త‌ప్పును చేసిన వ్యక్తులే పెద్దమ‌నుషుల ద్వార క్షమించాల‌ని ప‌వ‌న్‌ను ప్రాధేయ‌ప‌డుతున్నట్టు స‌మాచారం తెలుస్తుంది. ఈ విష‌యంపై టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ వ‌ద్దకు నిజంగా త‌ప్పు చేసిన వారు వ‌చ్చారంటూ కొంత మంది అంటుంటే, మ‌రి కొంత మంది మాత్రం ఈ త‌ర‌హా మాట‌ల్లో ఎటువంటి నిజం లేద‌ని తేల్చిచెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: