టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ఇగోలకు దూరంగా ఉంటాడు అనే మాటను అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. మహేష్ సినిమాలు చేయబోయే దర్శకుల లిస్టులో దర్శకుడు వంశీ పైడిపల్లి ఎప్పటి నుంచో ముడువరుసలో ఉన్నాడు. మహేష్ ‘సీతమ్మ వాకిట్లో’ సినిమా చేసే సమయంలోనే ఒక స్టోరీ లైన్ విని వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు అని అంటారు. అతరువాత వంశీ పైడిపల్లి ‘ఎవడు’ సినిమాలో బిజీ అయిపోవడం మహేష్ తన ‘1’ సినిమాలో బిజీగా ఉండిపోవడం జరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఒక ఆ శక్తికర కధనం ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మహష్ ను కలిసి తను రామ్ చరణ్ తో తీసిన ‘ఎవడు’ సినిమాను ఒకసారి చూడామని అడిగితే దర్శకుడు వంశీ పైడిపల్లి మాటలు కాదనలేక ప్రిన్స్ మహేష్ ‘ఎవడు’ సినిమాను చూసాడట. ఈ సినిమా టేకింగ్ చాలాబాగా వచ్చిందని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని దర్శకుడు వంశీకి చెప్పడమే కాకుండా తాను తప్పకుండా వచ్చే సంవత్సరం చివరిలో ఒక సినిమాను వంశీ పైడి పల్లికి చేస్తానని మాట ఇవ్వడమే కాకుండా ఈ సినిమా నిర్మాత డి రాజ్ కు కూడా ‘ఎవడు’ సినిమా బాగా వచ్చిందని అభినందించాడట మన టాలీవుడ్ ప్రిన్స్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘ఎవడు’ సినిమా ప్రమోషన్ కు సంబంధించి వచ్చేనెలలో ఒక భారీ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి దిల్ రాజ్, రామ్ చరణ్ లు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు అంటు వార్తలు కూడా వినపడుతున్నాయి. ఎదిఎమైనా మహేష్ ఎవడు పై మనసు పదినట్లుగానే కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: