పవన్ కళ్యాణ్ మారిపోయాడు. మీడియాకు దూరంగా ఉండే పవన్ తను నటించిన ‘అత్తారింటి’ కోసం మీడియకు ఇంటర్వ్యు లు ఇచ్చాడు. ఇది సరిపోదు అన్నట్లు తన అత్తారింటి దారేది వంద కోట్ల టార్గెట్ సాధించడం కోసం టివి రియాలిటి షోలలో కూడా అతిధిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూసిన పవన్ కళ్యాణ్‌ను తొలిసారిగా బుల్లితెర కార్యక్రమాల్లో చూడబోతున్నాం అనే వార్తలు వస్తున్నాయి . ఈటీవీలో ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహిస్తున్న ప్రముఖ ‘అలీ 369' షోలో పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండగను పురస్కరించుకుని నవంబర్ 3న ప్రసారం అయ్యే షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని అంటున్నారు అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ‘అత్తారింటికి దారేది' చిత్రం ప్రమోషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది . ఈ షో ద్వారా తన ‘అత్తారిల్లు’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చేపుతారట . పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో కమెడియన్ అలీ ఒకరు అన్న విషయం తెలిసిందే. ఈ స్నేహం రీత్యా అలీ నిర్వహిస్తున్న టీవీ షో కావడంతో పవన్ కళ్యాణ్ రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం నిజం గా దీపావళి నాడు పవన్ బుల్లి తెర ఫై కనిపిస్తే అది పవన్ అభిమానులకు నిజమైన పండుగే ... 

మరింత సమాచారం తెలుసుకోండి: