మహేష్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకoగా నిర్మింపబడటమే కాకుండా మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ ను నిర్ణయించే సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ మూవీ ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ను ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. అంతేకాదు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో మహేష్ తో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారట. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్‌ హీరోయిన్. ఈ గోవా షెడ్యుల్ తో సినిమా పూర్తి అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె వార్తలు చదవటాన్ని మొన్న రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేసేలా అత్యధిక ధియేటర్లలో ఈ సినిమాను అమెరికాలో విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసారు. మహేష్ బాబు తన సంక్రాంతి సెంటిమెంట్ తో హ్యాట్రిక్ కొట్టడానికి భారీ అంచనాలతో తన అభిమానుల కోసం ‘నేనొక్కడినే’ అంటూ వస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: