ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సంద‌ర్భాల్లో ఎంతో మందికి స‌హాయం చేశాడు. కొన్ని తెలిసిన‌వి ఉంటే, కొన్ని ఇప్పటికీ తెలియ‌ని ఉంటాయి. ప‌వ‌న్ ఎంత సంపాదించుకున్నాడో అందులో సగం పైగా సామాజిక సేవ‌ల‌కు ఉప‌యోగిస్తుంటాడు. ఒక్కోసారి ఆ స్థాయికి మించి కూడ స‌హాయాన్ని చేస్తుంటాడు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీసెంట్‌గా ఓ బాలిక ఆనారోగ్య స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటే ఆమెను ఆదుకున్నాడు. ఇది జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా, ఇప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌, కె.పి.హెచ్‌.బి లోని ఓ బాలిక, కిడ్నీ సంబంధిత స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని ఈ బాలిక పేరెంట్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గర‌కు తీసుకువెళ్ళారు. వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించి త‌న కారులోనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఆ పాప‌ను చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌న చారిటి త‌రుపు నుండి రెండు ల‌క్షల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చి ఆదుకున్నాడు. ఆ విష‌యాన్ని ఆ బాలిక త‌ల్లితండ్రులే మీడియాకు వివ‌రించారు. ప‌వ‌ర్‌స్టార్ రియ‌ల్ లైఫ్‌లోనూ ఓ మ‌నిషిగా ఉంటాడు, మ‌నిషిగానే ఆలోచిస్తాడు అనేది మ‌రోసారి నిరూపిత‌మైంది. ప్రస్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్‌సింగ్‌2 మూవీకు సంబంధించిన ప‌నుల్లో బిజిగా ఉన్నాడు. అత్తారింటికిదారేది బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌రువాత తెర‌కెక్కుతున్న మూవీ గ‌బ్బర్‌సింగ్ కావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ అబిమానుల్లో ఉన్నాయి. అందుకే గ‌బ్బర్‌సింగ్‌2 మూవీ ప్రధాన‌ పాత్రల ఎంపిక‌లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: