మంచు కుటుంబం నుంచి వస్తున్న తాజా సినిమా ‘పాండవులు..పాండవులు..తుమ్మెద’. చాలా కాలంగా సరియైన పాజిటివ్ పబ్లిసిటీ లేక వెనుక పడుతున్నామని మంచు కుటుంబం ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న ‘దూసుకెళ్తా’ కు మంచి రేటింగ్ లు సంపాదించాలని విశ్వ ప్రయత్నం చేసారు. కానీ సుఖం లేకపోయింది. దీంతో ఆ సినిమా చతికలపడింది. ఈ సమస్య రాకూదని ముందే మోహన్ బాబు రంగంలోకి దిగిపోయారని తెలిసింది. ఆయన నేరుగా పలు వెబ్ సైట్లకు కబుర్లు పెట్టేసారు. తమకు సహకరించాలని, ఇతోధికంగా ప్రతిఫలం వుంటుందని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు అప్పుడే రెండు మూడు వెబ్ సైట్ల ప్రతినిధులు వెళ్లి కలిసారని తెలిసింది. అయితే కొందరికి మాట మాత్రమే ఇచ్చారని, మరి కొందరికి అందాల్సినవి అందాయని కృష్ణనగర్ టాక్. దీంతో అందనివారు ‘మంచు’ కుటుంబంపై గస్సాయిస్తున్నారని వినికిడి. చూడాలి ఈ ప్యాకేజీలతోనైనా ‘పాండవుల’ సత్తా పెరుగుతుందేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: