సినిమా పరిశ్రమ గురించి వచ్చినన్ని వార్తలు మరి ఏ రంగం గురించీ రావు. సినీ పరిశ్రమ గురించి వచ్చినన్ని పుకార్లు కూడా మరి ఏ రంగం గురించీ రావు. అందుకే రానురాను సినిమా వాళ్లకు సబంధించిన ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో అర్థమే కాకుండా పోతోంది. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే... రీసెంట్ గా హీరోయిన్ వేదిక గురించి ఓ వార్త తెలిసింది. ఓ సినిమా షూటింగులో ఆమె ప్రమాదం బారిన పడిందని, కాస్త ఉంటే ఆమె ప్రాణాలే పోయి ఉండేవని, అదృష్టం కొద్దీ తప్పించుకుందని రాశారు. ఓ వాటర్ ట్యాంకులో దూకాల్సిన సన్నివేశం తీస్తుండగా... వేదిక ట్యాంక్ లోకి దూకగానే ఆ ట్యాంక్ గోడ కూలిపోయి ఆమె మీద పడిపోయిందని, వెంటనే పక్కనే ఉన్న స్పాట్ బోయ్ రక్షించాడని, లేదంటే ఆమె ఏమైపోయేదో అంటూ వార్త గుప్పుమంది.ఇది విని అందరూ కంగారు పడ్డారు. కానీ అసలు విషయం ఏంటో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? కేరళలో సింగరవేలన్ అనే మలయాళ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోతో దిలీప్ తో పాటు క్లయిమాక్స్ చిత్రీకరణలో పాల్గొంటోంది వేది. సరిగ్గా అప్పుడే జరిగింది ఈ సంఘటన. వాటర్ ట్యాంక్ గోడ కూలిపోయింది. కానీ వేదికకు ఏమీ కాలేదు. చక్కగా షూటింగ్ కంటిన్యూ చేసింది. ఇంతవరకూ ఓకే. కానీ ఈ మొత్తం స్టోరీ వెనుక ఓ కామెడీ ఉంది. అదేంటంటే... సింగర వేలన్ సినిమా ఎప్పుడో సెప్టెంబర్ లోనే విడుదలైపోయింది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన ఈ సంఘటన మే నెలలో జరిగింది. మరి ఆ వార్త ఇప్పుడు రావడమేంటి అంటూ కొందరు కూపీ లాగడంతో విషయం బయటకు వచ్చింది. ఇదంతా వేదిక, ఆమె మేనేజర్ కలిసి పబ్లిసిటీ స్టంట్ కోసం చేశారని కొందరి అనుమానం. కానీ వాళ్లు తమకేమీ తెలియదని, ఎప్పుడో జరిగింది ఇప్పుడు వార్తల్లోకి రావడమేంటి అని అంటున్నారట. ఏది ఏమైనా ఇలాంటి వింత సంఘటన ఇండస్ట్రీలో ఇంతవరకూ ఎప్పుడూ జరిగివుండదేమో!  

మరింత సమాచారం తెలుసుకోండి: