బాలీవుడ్లో అన్నీ కోట్లలోనే నడుస్తుంటాయి. అంతకంటే తక్కువ ఫిగర్లు వాళ్ల మాటల్లో కానీ, తీసుకునే రెమ్యునరేషన్లో కానీ ఉండవు. టాలీవుడ్ నే తీసుకుంటే ఇక్కడ హీరోలు మాత్రమే కోట్లలో ఫలితాలు అందుకుంటారు. ఆ తర్వాత దర్శకులు. హీరోయిన్లు మాత్రం కోటి అన్న మాటకు కాస్త దూరంగానే ఉంటారు. ఎంతో టాప్ పొజిషన్ కి వెళ్తే కానీ వాళ్ల రెమ్యునరేషన్ కోటి దాటదు. కానీ బాలీవుడ్లో అలా కాదు. బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ పది కోట్లకు చేరువవుతోంది. ఒకప్పుడు కోటి రూపాయలే గగనమనుకుంటే, ఇప్పుడు పది కోట్ల వరకూ ఈజీగా చేరిపోతున్నారు ముద్దుగుమ్మలు. ఆ లెక్కల్ని బట్టి చూస్తే... ముగ్గురు సుందరీ మణులు టాప్ త్రీ పొజిషన్స్ లో ఉన్నారు. ఆ ముగ్గురూ... దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, సోనాక్షీసిన్హా. ప్రస్తుతం బాలీవుడ్ లక్కీ గాళ్ ఎవరంటే... దీపికా పదుకొనేనే. మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యేసరికి అమ్మడి రేంజే మారిపోయింది. యే జవానీ హై దివానీ చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీల చిత్రాలు ఆమెని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దాంతో ఆమె రెమ్యునరేషన్ పది కోట్లకు చేరిపోయింది. ఇప్పుడామె పది కోట్ల పైనే డిమాండ్ చేస్తోందని వినికిడి. ఇక క్రిష్ సినిమా తర్వాత ప్రియాంకా చోప్రా పది కోట్లు తీసుకోవడానికి ఫిక్సయిపోయింది. ఇక సోనాక్షి తొమ్మిది కోట్లు తీసుకుంటోందట. నిజానికి ఈమె ప్రియాంక కంటే కూడా బిజీ అయిపోయింది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమెను బీటవుట్ చేయడానికి బహుశా ఎన్నో రోజులు పట్టదు సోనాక్షికి. అదీ బాలీవుడ్ టాప్ త్రీ సుందరీమణుల రేటు. ఈ ముగ్గురూ బాలీవుడ్ ఏలుతున్నారు. ఆ తర్వాత కరీనా దున్నుతోంది. నిజానికి పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది కానీ, లేదంటే ఈమె టాప్ త్రీలో ఉండి ఉండేది. ఏదైతేనేం... ఏ వుడ్లోనూ హీరోయిన్ కి దక్కనంత సొమ్ము దక్కుతోంది బాలీవుడ్ భామలకి. అదే విశేషం!

మరింత సమాచారం తెలుసుకోండి: