టాలీవుడ్ హీరోలందరూ వివిధ రకాల మల్టీ నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లు గా మారిపోయి కోట్లు సంపాదిస్తూ ఉంటే పవన్ మాత్రం ఛారిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడా అని అనిపిస్తోంది. ఈమధ్యనే హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో తీవ్ర అనారోఘ్యంతో బాధ పడుతున్న ఒక అమ్మాయి జాలి గాధ పేపర్లో చదివి జాలితో ఎవరికీ చెప్పకుండా సహాయం చేసి వచ్చిన పవన్ గురించి కధనాలు చదివాము.  ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ అభిమానులు బెంగుళూరు లో రోడ్లకు ఇరువైపులా దిక్కు తోచని స్థితిలో చలికి వణుకుతూ పడుకునే అభాగ్యుల కోసం పవన్ చొరవతో పవన్ అభిమానులు వారికి దుప్పట్లను పంచే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా పవనిజమ్ మెరుపులను కన్నడ దేశ రాజధాని బెంగుళూరులో కూడా కనిపించే లా చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  సామజిక కార్యక్రమాలలో తాను ముందు ఉండి సహాయం చేయడమే కాకుండా తన అభిమానుల చేత కూడా ఈ సేవా కార్యక్రమాలు తరుచూ పవన్ చేయించడం బట్టీ చూస్తూ ఉంటే పవనిజమ్ రాష్ట్ర హద్దులు దాటి వేరే రాష్ట్రాల దిశగా కూడా పవనిజమ్ పరుగులు తీస్తోంది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: