పవన్ కళ్యాణ్ మూడవ పెళ్ళి సృస్టించిన షాక్ నుండి పవన్ అభిమానులే కాదు మీడియా కూడా తేరుకో లేక పోతోందా అని అనిపిస్తోంది. ఈ విషయంలో పవన్ తమిళ నటుడు జెమినీ గణేషన్ ఫాలో అవుతున్నాడుఅంటూ మీడియా రాతలు రాస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ కు ధీటుగా హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న జెమినీ గణేషన్ బాలీవుడ్ తార రేఖ తండ్రి. తమిళ తెరకే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన రామస్వామి గణేశన్ ఉరఫ్ జెమిని గణేశన్ ప్రముఖ నటి సావిత్రికి భర్త.  ఓ దశలో ఎంజీ రాంచంద్రన్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతుంటే తమిళ రంగంలో 'కాదల్ మన్నన్ (కింగ్ ఆఫ్ రొమాన్స్)'గా పేరును సొంతం చేసుకున్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా జెమినీ గణేషన్ కింగ్ రొమాన్స్ గా మారి నాలుగు పెళ్లిళ్లతో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు. జెమినీ గణేషన్ తొలుత అలమేలును పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత పుష్పవల్లి వివాహ మాడారు. పుష్పవల్లి, జెమినీ గణేషన్ కూతురే రేఖ. తమిళ తెరపైన జెమినీ,సావిత్రిల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అయితే సావిత్రితో సాగించిన ప్రేమాయణ జెమినీ గణేషన్ మూడోపెళ్లికి దారి తీసింది.  ఆతర్వాత సావిత్రితో విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. ఆతర్వాత జెమినీ గణేషన్ తన 79వ ఏట విదేశీ వనిత జూలియానా యువతిని పెళ్లాడి కుటుంబాన్ని, స్నేహితుల్ని, సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జెమినీ గణేషన్ జీవితంలో మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకుని అభిమానులను మీడియాను, అభిమానులను ఆశ్చర్యానికి లోను చేశారు అని కధనాలు వస్తున్నాయి  పవన్ మూడవ పెళ్లి వార్తలు రానంత వరకు పవన్ ఫై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాయడానికి భయ పడే మీడియా ఇప్పుడు రక రకాల కామెంట్స్ పవన్ జీవితం ఫై చేస్తూ టాలీవుడ్ లో సంచలనానికి తెరతీస్తున్నారు. అంతేకాదు ప్రతి సమస్యకు మౌనం ఒకటే సమాధానం కాదని సమాజాన్ని ప్రభావితం చేసే సెలెబ్రెటీలు ప్రతి విషయాన్ని తమ వ్యక్తిగతం అని తప్పించుకోలేరని వారిని అభిమానించే కోట్లాదిమంది కోసమైనా పవన్ మౌనం వీడాలని అటు అభిమానులు ఇటు సమాజం కోరుకుంటోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: