రామ్‌చరణ్‌ కు ఒకనాటి గోల్డెన్ లెగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి చెర్రీ తో నటించ బోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’, ‘నాయక్’ ఏ స్థాయి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న చిత్రంలో చరణ్‌కు జోడీగా తొలుత తమన్నాని ఎంపిక చేశారు.  అయితే ఆమె ‘బాహుబలి’, ‘ఆగడు’ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉండడంతో, ఆ అవకాశం కాజల్‌కు దక్కింది అని వార్తలు వస్తున్నాయి. ‘బాద్‌షా’ తర్వాత కాజల్ తెలుగులో ఏ సినిమా కమిట్ కాలేదు. చాలా విరామం తర్వాత కాజల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే. కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ ఇంతకుముందు ‘చందమామ’ చేశారు. ఆ చిత్రంతోనే ఆమె కెరీర్‌కు బ్రేకొచ్చింది. ఈ కొత్త సినిమా చిత్రీకరణ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. ఇందులో చరణ్‌తో పాటు శ్రీకాంత్ కూడా నటించనున్నారు. మొదట ఆ పాత్ర వెంకటేష్ చేస్తారని ప్రచారం జరిగింది.  టాలీవుడ్ హీరోల పేరు చెపితే బారెడు దూరం పారిపోయిన కాజల్ తిరిగి మనసు మార్చుకుని యూటర్న్ తీసుకుని రామ్ చరణ్ తో నటించడానికి కాజల్ అంగీకరించడానికి కారణం ఆమె అడిగిన భారీ పారితోషికానికి నిర్మాతలు ఓకె చేయడమే అసలు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: