విలక్షణ నటుడు విక్రమ్ కలియుగ కృష్ణుడు గా కనిపించడానికి రంగం సిద్ధం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు తమిళ స్టార్ హీరో విక్రమ్,వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మాణానికి ప్రాధమిక చర్చలు జరుగు తున్నట్లుగా తెలుస్తోంది.  ‘ఓ మైగాడ్’ బాలీవుడ్ చిత్రం రీమేక్ లో కృష్ణుడు పాత్రకు గానూ విక్రమ్ ని అడుగుతున్నారని టాక్. ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో మరో కీలకపాత్ర అయిన పరేష్ రావల్ పోషించిన పాత్ర కోసం విక్రమ్ ను అడిగినట్లుగా తెలుస్తోంది.  ‘తడాఖా’ దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. అయితే విక్రమ్ వద్ద పెట్టిన ఈ ప్రపోజల్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని,అందుకోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు రీమేక్ సినిమాల పై మోజుపడే వెంకటేష్, అక్షయ్‌ కుమార్‌, పరేష్‌ రావల్‌ నటించిన 'ఓ మై గాడ్‌' చిత్రన్ని వచ్చే సంవత్సరం నిర్మించాలి అనే పట్టుదల పై ఉన్నాడని సమాచారం. బాలీవుడ్ లో విజయం సాధించిన ఈ సినిమా కధలో చాల మార్పులు చేర్పులు చేస్తూ వెంకటేష్ కొరియర్ లో ఒక మంచి సినిమాగా మార్చడానికి వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ స్క్రిప్ట్ వర్క్ ను దగ్గర ఉండి తయారుచేస్తున్నట్లు చెపుతున్నారు. మరి వెంకటేష్ కోరికను విక్రమ్ మన్నిస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: