మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఎవ‌డు మూవీకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతుంది. ఈ రోజు ఎవ‌డు మూవీకు సంబంధించిన టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు ప‌దిహేను సెంక‌డ్లు ఉంటే ఈ టీజ‌ర్ దుమ్మురేపబోతుంది అంటూ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అలాగే ఎవ‌డు మూవీ కొత్త ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 3న రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఎవ‌డు మూవీ రిలీజ్ డేట్‌పై అనుమానాలు రాకుండా, ప‌దే ప‌దే ప్రమోష‌న్స్‌ను చేస్తున్నారు. జ‌న‌వ‌రి 12న‌ ఎవ‌డు మూవీ రిలీజ్ డేట్ ఖ‌న్‌ఫ‌ర్మ్ అంటూ దిల్‌రాజు త‌న పి.ఆర్.మిష‌న్ ద్వార అంద‌రికి తెలియ‌జేస్తున్నాడు. జ‌న‌వ‌రి నుండి రెండు వార‌ల పాటు ఎవ‌డు మూవీ ప్రమోష‌న్స్ కోసం భారీగా ప్లానింగ్స్ చేసుకున్నాడు. అయితే జ‌న‌వరి 1న ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేద్దాం అంటే, అందుకు చ‌ర‌ణ్ మొద‌ట టీజ‌ర్ చాలు, త‌రువాత ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయండి అని స‌ల‌హా ఇచ్చాడంట‌. ఎందుకు ఇలా చెప్పాడో తెలియ‌దు కాని ఎవ‌డు మూవీపై అభిమానుల్లో భారీగానే ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి. ఎవ‌డు మూవీలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్‌, అమీజాక్సన్ న‌టిస్తుంది. ఈ మూవీ త‌రువాత చ‌ర‌ణ్, క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ద‌ర్శక‌త్యంలో పనిచేయ‌బోతున్నాడు. ఈ మూవీ 2014 ఆగ‌ష్ట్ నెల‌లో రిలీజ్ చేయ‌టానికి ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి. ఏదేమైనా ఎవ‌డు మూవీ ప్రమోష‌న్స్‌ను భారీగా చేయ‌డంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: