ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2013వ సంవత్సరం చివ‌రిలో ఆభిమానుల‌కు కొద్దిపాటి అస‌హ‌నాన్ని ఇవ్వటంతో, టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ మ‌రో హీరోకు వెళ్ళిపోయింది. 2013వ సంవ‌త్సరం మొద‌టిలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు మూవీతో భారీ స‌క్సెస్‌ను అందుకున్నాడు. ఆ త‌రువాత నుండి ప్రిన్స్ మ‌హేష్‌బాబు నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో అలాగే కొన‌సాగుతున్నాడు. అయితే అత్తారింటికిదారేది మూవీ త‌రువాత ప్రిన్స్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఛాలెంజ్ విసిరాడు. యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెంబ‌ర్ అని చెప్పారు. అయితే ప‌వ‌న్ వ్యక్తిగ‌త జీవితంలో వ‌చ్చిన అల‌జ‌డి, త‌న స్టార్‌డంను వెన‌క్కి నెట్టేసింది. ఎంతటి సెల‌బ్రిటీ అయినా, ఆ హీరో వివాదాల జీవితాన్ని మాత్రం కొంత మంది అభిమానులు ఇష్టప‌డ‌టంలేదు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇద్దరికి స‌మాన‌మైన స్టార్‌డం ఉన్నప్పటికి మ‌హేష్‌బాబు ప‌ర్సన‌ల్ లైఫ్ చాలా సాఫిగా వెళుతుంది. అలాగే హోమ్లి హీరోగానూ సిని ప్రేక్షకుల్లో పేరు ఉంది. ఆ విధంగా చూసుకుంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కంటే ప్రిన్స్ మ‌హేష్‌బాబునే అంద‌రూ ఇష్టప‌డుతున్నారు. దీనంత‌టికి ప‌వ‌న్ చేస్తున్న త‌ప్పిదాలే కార‌ణం అంటున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెంబ‌ర్ స్థానం మ‌ళ్ళీ వెన‌క్కి వెళ్ళింద‌ని టాలీవుడ్ అంటుంది. మొత్తంగా ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఎప్పటిలాగే త‌నదైన శైలిలో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం మ‌హేష్ వ‌న్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించందంటే ప్రిన్స్ స్థానానికి తిరుగే ఉండ‌దంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: