ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి ఓ మూవీను తీయ‌టానికి రెడీ అవుతున్నాడ‌ని గ‌త వారం రోజులగా టాలీవుడ్‌లో ఈ వార్త తెగ చ‌క్కెర్లు కొడుతుంది. రాజ‌మౌళి స్వయంగా వెళ్ళి, ఫాం హౌస్‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్టోరిను వినిపించాడ‌ని, అందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని టాక్స్ వినిపించాయి. అయితే ఈ వార్తల‌పై నిజం ఎంతో అని ఎపిహెరాల్డ్‌.కామ్ రాజ‌మౌళి క్యాంప్ ఆఫీస్ నుండి స్పష్టమైన న్యూస్‌ను తీసుకువ‌చ్చింది. అలాగే ఇదే న్యూస్ పై రాజ‌మౌళి కూడ ట్విట్టర్‌లో ట్వీట్ ఇచ్చాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నేను ఎటువంటి స్టోరిను రాయ‌లేదు అని క్లారిటి ఇచ్చాడు. అలాగే రాజ‌మౌళి ఆఫిన్ నుండి కూడ ఇదే రియాక్షన్ వ‌చ్చింది. ఎవ‌రో కావాల‌నే రాజ‌మౌళి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో మూవీ అంటూ గాసిప్‌ను క్రియోట్‌ చేశారు. ప్రస్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి మీదే దృష్టిని పెడుతున్నాడ‌ని, అంత‌కు మించి ఏమి ఆలోచించ‌టంలేద‌ని తెలిపారు. అలాగే రాజ‌మౌళి మ‌రో రెండు గాసిప్స్‌పై క్లారిటి ఇచ్చాడు. బాహుబ‌లి మూవీలో తార‌క్ న‌టించ‌డంలేదు. అలాగే సునీల్ సైతం బాహుబ‌లి మూవీలో న‌టించ‌డంలేదు అంటూ గాసిప్స్‌ను గ‌ట్టిగానే ఖండించాడు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి మూవీ లేద‌ని ఓ క్లారిటి వ‌చ్చింది. రాజ‌మౌళి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్ బ్లాక్ బ‌స్టర్ కాంబినేష‌న్ అవుతుందా? లేక ఇది ఎన్నటికి జ‌ర‌గ‌ని కాంబినేష‌న్‌గా మిగులుతుందా? ఈ టాపిక్స్‌పై మీ కామెంట్స్‌ను తెలియ‌జేయ‌డండి.

మరింత సమాచారం తెలుసుకోండి: