మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెద' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈసినిమా టాక్ కు సంబంధించి ఎపిహెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబును తుమ్మెదలు కుట్టకుండా తేనెను కురిపిస్తాయి అనే వార్తలు వస్తున్నాయి. సినిమాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా నెగిటివ్ టాక్ రాకపోవడంతో ఈ సినిమా నెమ్మదిగా పాజిటివ్ టాక్ వైపు మళ్ళుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఈ రోజు తిరుపతిలో మోహన్ బాబు తన శ్రీవిధ్యా నికేతన్ విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని చూసారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే 30 కోట్లు ఖర్చు పెట్టి తీసామని, ఆపై జయాపజయాలు దేవుడి చేతుల్లోనే అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను కరుణించినట్లే కనిపిస్తోంది. మంచు వారి కుటుంబ సినిమాగా శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు అన్న విషయం తెలిసిందే. ‘లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ అందించిన పాటలు ఈ సినిమా చూస్తున్న ప్ర్క్షకులను బాగానే అలరిస్తున్నాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఈ సినిమా ‘పెదరాయుడు’ రేంజిలో హిట్ అవుతుంది అని నమ్మకంగా చెప్పాడు. ఈ సినిమా ఎరేంజ్ హిట్ అన్నది ప్రస్తుతం చెప్పలేకపోయినా చాలాకాలం తరువాత మోహన్ బాబు నటించిన సినిమాకు దేవుడు హిట్ ఇచ్చాడనే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: