2014వ సంవత్సరం మొదటి నెలలోనే రెండు భారీ మూవీలు టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకటి మహేష్బాబు నటించిన వన్ మూవీ అయితే, రెండోవది మెగా హీరో రామ్చరణ్ నటించిన ఎవడు మూవీ. వన్, ఎవడు మూవీలు రెండు టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద పోటీపడటం ఇది మొదటి సారి ఏమి కాదు. 2013లోనూ వీరిద్దరూ బాక్సాపీస్ వద్ద పోటీ పడి సక్సెస్ హీరోలుగా నిలిచారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ లెక్క తప్పిపోయింది.
మహేష్బాబు 1 మూవీ కలెక్షన్స్ కంటే ఎవడు మూవీ కలెక్షన్స్ బెటర్ అని రిపోర్ట్స్ తేల్చేసాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వన్ మూవీ ముందుంజలో ఉంది. వన్ మూవీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రపంచ ఖ్యాతి గడించింది. ఇదిలా ఉంటే రీసెంట్గా వన్, ఎవడు మూవీల డబ్బింగ్ రైట్స్ను హిందీ ఛానల్స్ కైవసం చేసుకున్నాయి. ఆ రిపోర్ట్ను ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. వన్ మూవీ డబ్బింగ్ రైట్స్ నలభై లక్షలను మించి అమ్ముడు పోయిందని హింధీ ఛానల్స్ కథాంశం.
ఎవడు మూవీ మాత్రం ముఫ్పై అయిదు లక్షల వరకూ అమ్ముడు పోయిందట. దీంతో బాలీవుడ్లో మహేష్ మూవీకు మార్కెట్ ఉందని తేలిసింది. అంతే కాకుండా వన్ మూవీ హింధీ కలెక్షన్స్ 4 కోట్ల రూపాయల వరకూ వచ్చాయి. ఎవడు మూవీకు మాత్రం 3.6 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మొత్తానికి బాలీవుడ్లో మహేష్ మార్కెట్ పెరుగుతుందని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి.
బాలీవుడ్ వన్ మూవీలో ఏ హీరో నటిస్తాడు? వన్ మూవీను బాలీవుడ్లో రిమేక్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియపరచండి.
మరింత సమాచారం తెలుసుకోండి: