ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషి మూవీలో న‌టించిన హీరోయిన్ భూమిక‌. భూమిక ఖుషి మూవీ త‌రువాత వ‌రుస మూవీలు చేసుకుంటూ టాలీవుడ్‌, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస స‌క్సెస్‌ల‌ను సాధించుకుంటూ వ‌చ్చింది. అలాగే భూమిక ప్ర‌ధాన ప్రాత్ర‌లో వ‌చ్చిన మూవీలు సైతం చెప్పుకోద‌గ్గ స‌క్సెస్‌ను సాధించాయి. అయితే రీసెంట్‌గా భూమిక ఓ బేబికు జ‌న్మ‌నిచ్చింది. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది. భూమిక‌, భ‌ర‌త్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకున్న త‌రువాత కూడ మూవీల‌ను చేస్తూ వ‌స్తుంది. అయితే గ‌త కొంత కాలంగా భూమిక ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు దూరంగా ఉంటూ వ‌చ్చింది. రీసెంట్‌గా భూమిక అల్ల‌రి న‌రేష్ న‌టించిన ల‌డ్డుబాబు మూవీలో న‌టించింది. ఇందులో భూమిక స్పెష‌ల్ రోల్‌ను పోషించింది. ఈ మూవీ స‌మ‌యంలోనే భూమిక ప్రెగ్నెంట్‌గా ఉంటూనే షూటింగ్‌లో పార్టిసిపెట్ చేసింది. భూమిక త‌నకు బేబి బాయ్ పుట్టాడ‌ని త‌న ఫీలింగ్స్‌ను అంద‌రితో పంచుకుంది. 'బేబి పుట్ట‌డంతో నాకు కొత్త జ‌న్మ వ‌చ్చింది. త‌ల్లిగా నేను నా బాధ్య‌త‌ల‌ను ఇప్పుడు చూడాల్సి ఉంటుంది' అంటూ భూమిక త‌న త‌ల్లి ఫీలింగ్స్‌ను అభిమానుల‌తో పంచుకుంది. అలాగే భ‌ర‌త్ ఠాకూర్ కూడ‌ భూమిక బేబికు జ‌న్మ‌నిచ్చింద‌ని అఫిషియ‌ల్‌గా చెప్పాడు. మొత్తానికి భూమిక త‌ల్లిగా మారడంతో త‌ను మ‌రో రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ మూవీల‌కు దూరంగా ఉంటుంద‌ని కూడ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: