ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ మూవీల‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడ ఒక‌టి ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వెంక‌టేష్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న మూవీ ఓ రిమేక్ మూవి. హిందిలో సూప‌ర్ స‌క్సెస్‌ను సాధించిన ఓ మై గాడ్ మూవీను తెలుగు రిమేక్‌లో వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారు. అయితే ఈ మూవీకు సంబంధించిన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు 'ఓరి దేవుడా' అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు చిత్ర‌యూనిట్ నుండి అందుతున్న స‌మాచారం. అయితే ఈ టైటిల్‌తో పాటు మ‌రో నాలుగు టైటిల్స్‌ను కూడ అనుకుంటున్నారు. అన్నింటిలో కంటే ఈ టైటిల్ చాలా క్యాచివ్‌గా ఉంద‌ని, అంద‌రూ ఈ టైటిల్‌కే ఆస‌క్తి చూపుతున్నార‌ని టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. మ‌రి కొద్ది రోజుల్లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మల్టీస్టార‌ర్ మూవీ టైటిల్ ఏంటి అనేదానిపై అఫిషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తార‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి అందిన క్లియ‌ర్ న్యూస్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం గ‌బ్బ‌ర్‌సింగ్‌2 మూవీకు సంబంధించిన ప‌నుల్లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీను 2015లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: