మెగా ఫ్యామిలి నుండి మ‌రో అస‌లైన మెగా హీరో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అవుతున్నాడు. సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రి ఇస్తున్న మెగా డెబ్యూ హీరో వ‌రుణ్‌తేజ్‌. త‌నే నాగ‌బాబు త‌న‌యుడు. రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్‌కు సంబంధించిన షూటింగ్‌కు ముహ‌ర్తం పెట్టేశారు. ఈ షూటింగ్ ప్రారంభానికి మెగా హీరోలు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ అటెండ్ అయ్యారు. దీంతో వ‌రుణ్‌తేజ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా, మెగా అభిమానుల్లోనూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న డెబ్యూ మూవీకు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ ఓపెనింగ్ రోజునే వ‌రుణ్ తేజ్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు. ఈ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ ప్ర‌త్యేకంగా మీకు అందిస్తుంది. 'నీ డెబ్యూ మూవీకు ఏ విధంగా నేను ఉప‌యోగ‌ప‌డ‌తానే చెప్పు, చేస్తాను' అని మాట ఇచ్చాడ‌ట‌. అయితే కోలీవుడ్ ఇండ‌స్ట్రీ స‌మ‌చారం మేర‌కు వ‌రుణ్‌తేజ్ డెబ్యూ మూవీ స్టార్టింగ్‌లో, హీరో ఇంట్ర‌డెక్ష‌న్ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్ ఉంటుద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విధంగా జ‌రిగితే ధియోట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల‌తో మూవీను పాజిటివ్‌గా చూసే ఛాన్స్ ఉంటుంద‌ని చిత్ర యూనిట్ అంటున్నారు. అందుక‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేత వ‌రుణ్ తేజ మూవీకు వాయిస్‌ను చెప్పించ‌టానికి నిర్ణ‌యం తీసుకోవాల‌ని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నాడు. మొత్తానికి వ‌రుణ్‌తేజ్ మూవీకు ప‌వ‌న్ త‌న వాయిస్‌తో బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: