క్యూట్ స్మైల్ తో సినిమాలను చేస్తున్న పంజాబి పాప బాలీవుడ్ వైపు అడుగులేస్తుందట. తెలుగు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా అడపాదడపా మెరుస్తున్న ఈ చిన్నది ఇక పూర్తిగా బాలీవుడ్ సినిమాలనే చేయాలని నిర్ణయించుకున్నదట. అందుకే ముంబై కి మకాం మార్చేస్తుందని టాక్. ఇంతకీ బాలీవుడ్ కి మకాం మారుస్తున్న ఆ హీరోయిన్ ఎవరో మీరే చూడండి. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సుందరి తాప్సి. ఆ సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా ఆఫర్లను చేజిక్కించుకున్న ఈ పాప సినిమాలను మాత్రం హిట్ చేసుకోలేకపోయింది. చేయడానికి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసినా ఆమెకు ఇక్కడ అంత స్టార్ ఇమేజ్ రాలేదు. అందుకే అమ్మడు తన అదృష్టాన్ని మొదటిసారి బాలీవుడ్ లో చష్మే బద్దుర్ సినిమాతో పరిక్షించుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అక్కడ సినిమాలను చేయడానికి తెగ అంపర్లాడుతుంది. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం సినిమాల పరంగా కౌంట్ ఇక్కడ కౌంట్ ఎన్ని ఉన్నా అక్కడ ఒక్క సినిమా సూపర్ హిట్ వచ్చే సరికి అక్కడికి జంప్ అవ్వబోతుందట ఈ అమ్మడు. కోలీవుడ్ లో కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపుతెచ్చుకున్న తాప్సి కోలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమానే ధనుష్ ని నేషనల్ అవార్డ్ ని తెచ్చిపెట్టింది. చష్మే బద్దూర్ సినిమా ఇచ్చిన కిక్ తో అక్కడయితేనే ఇంకొన్ని సినిమాలు చేయొచ్చని బ్యాగ్ సర్దుకుని ముంబై కి షిఫ్ట్ అవుతందట తాప్సి. ఈ మధ్య తెలుగులో వచ్చిన సాహసం , తమిళ్ లో వచ్చిన ఆరంభం సినిమాలతో హిట్ అందుకున్న ఈ హాట్ గర్ల్ అక్కడ ఎంతమంది ఆడియెన్స్ మనసులను కొల్లగొడుతుందో చూద్దాం. తాప్సి బాలీవుడ్ వెళ్ళడంపై మీ అభిప్రాయం..?

మరింత సమాచారం తెలుసుకోండి: