మెగా హీరో అల్లుఅర్జున్ నటించిన రేసుగుర్రం మూవీ బాక్సాపీస్ వద్ద ధుమ్ముదులుపుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రేసుగుర్రం మూవీకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడ మంచి రేటుకే వెళ్ళిందని టాలీవుడ్ చెబుతుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్లియర్ న్యూస్ ప్రకారం రేసుగుర్రం మూవీ శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి పెద్ద మొత్తంలో తీసుకుంది. దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలకు జెమిటి టీవి రేసుగుర్రం మూవీ శాటిలైట్ రైట్స్ ను తీసుకుంది. నిజానికి రేసుగుర్రం మూవీను జెమిని టివి డైరెక్ట్ గా తీసుకోలేదు. మధ్యలో ఓ వ్యక్తి ద్వారా జెమిటి టివి, వారి వద్ద నుండి ఏడున్నర కోట్ల రూపాయలకు తీసుకుంది. థర్ట్ పార్టీ రేసుగుర్రం మూవీను ఏడుకోట్ల రూపాయలకు కొనగా, జెమిని టివి మరో యాబై లక్షల రూపాలను ఇచ్చి వారి వద్ద నుండి ఏడున్నర కోట్ల రూపాయలకు తీసుకుంది. రేసుగుర్రం మూవీ బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంటో జెమిని టివి ఇంత పెద్ద మొత్తంలో రైట్స్ ను తీసుకోవటానికి సిద్ధపడిందని అంటున్నారు. అల్లుఅర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మొత్తానికి రేసుగుర్రం మూవీకు శాటిలైట్ బిజినెస్ బాగానే జరిగిందని టాలీవుడ్ టాక్. రేసుగుర్రం మూవీ శాటిలైట్ రైట్స్ ఏడున్నర కోట్ల రూపాయలకు కొనడం సరైనదేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: