అప్పటిదాకా సమస్యలతో సతమత మవుతున్న అమితాబ్ బచ్చన్ కెరియర్ ను అయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీవీ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్ పతి' ఎటువంటి మలుపు తిప్పిందో అందరకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ కార్యక్రమానికి తెలుగు వర్షన్ రాబోతున్న సంగతి ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు అన్న వార్తలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ‘మీలో కోటీశ్వరులు ఎవరు' అనే పేరుతో సాగే ఈ కార్యక్రమం ఈ రోజు నుండి మాటీవీలో మొదలు కానుంది. అయితే ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనే తొలి అవకాశం నాగార్జున తన భార్య అమలకు కల్పించాడట. దీనితో నాగ్ తన భార్యను ఈ కార్యక్రమం ద్వారా కోటీశ్వరాలిని చేసేందుకు నాగార్జున ప్లాన్ చేసాడని సెటైర్లు పడుతున్నాయి. నోవాటెల్ హోటల్‌లో ‘మీలో కోటీశ్వరులు ఎవరు' కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది అని తెలుస్తోంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా నాగార్జునకు మూడు కోట్లు పారితోషికం ఈ షో నిర్వాహకులు ఆఫర్ చేసినట్లు టాక్. హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి' అమితాబ్ కు ఎటువంటి పాపులారిటి తీసుకు వచ్చిందో అదేవిధంగా నాగ్ ను ‘మీలో కోటీశ్వర్లు ఎవరు’ కార్యక్రమం బుల్లితెర సూపర్ స్టార్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: