టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏవిధంగా ఆఫర్స్ వస్తాయో తెలియదు. ఒక్కసారి వచ్చిన ఆఫర్స్ ను సక్సెస్ గా మార్చుకోకపోతే, తరువాత కెరీర్ ఎలా ఉంటుందో చెప్పటం కూడ కష్టమే. ఆ విధంగానే బిగ్ మూవీల దర్శకుడిగా ఎదుగుతున్న యంగ్ డైరెక్టర్ వీరభద్రం పరిస్థితి ప్రస్తుతం డైలమాలో ఉంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'భాయ్' సినిమా ఫ్లాప్ అవడంతో దర్శకుడు వీరభద్రం అడ్రస్ లేకుండా పోయాడు. ఈ మూవీ తర్వాత వీరభద్రానికి ఆఫర్స్ ఒక్కటి కూడా రాలేదు. నాగార్జున కూడా ఈ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడాడు. తర్వాత వీరభద్రంను దాదాపు ఇండస్ట్రీ అంతా ఓ రకంగా చూసిందని చెప్పారు. కానీ చాలా గ్యాప్ తీసుకున్న వీరభద్రం ఇప్పుడు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉన్న అల్లరి నరేష్ కి ఓ కథ చెప్పి ఒప్పించాడట వీరభద్రం. ఈ సినిమాకు ''బిస్కెట్ రాజా'' అనే టైటిల్ కూడా పెట్టారని టాక్. దీనితో మరోసారి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి చూపించాలని ఫిక్స్ అయ్యాడట ఈ దర్శకుడు. అయితే వీరభద్రానికి కామెడీపై కొంత పట్టుంది. అదే పట్టుకుని కథలు రాసుకుంటే బావుంటుంది కానీ, అలా కాదని మాస్ ఇమేజ్ మోజులో పడి ఫెయిల్ అవడం ఎందుకని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ బిస్కెట్ తో వీరభద్రం ఆడియెన్స్ ను నవ్విస్తాడా..? లేక నవ్వుల పాలు అవుతాడా.. అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: