కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ ల మధ్య స్నేహం 40 సంవత్సరాలది. రజినీని ఇప్పటికి కూడ ‘వాడు’ అని సంభోదించే చనువు మోహన్ బాబు సొంతం. అటువంటి మోహన్ బాబు నిన్న రాత్రి జరిగిన రజినీకాంత్ ‘విక్రమ సింహ’ ఆడియో వేడుకలో చాలామందికి తెలియని ఒక కొత్త విషయాన్ని బహిరంగంగా తెలియచేసాడు. మోహన్ బాబు రజినీ కుమార్తెలు ఇద్దరినీ తన కోడళ్ళుగా చేసుకుందామని అనుకున్నాడట. అయితే అది ఎందుకో కుదరలేదు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అన్నీ మన చేతులలో ఉండవు కదా అని అంటు వేదాంతం మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇదే సందర్భంలో మరో అతిధిగా మాట్లాడిన దాసరి ‘ కొడుకు సినిమాకి దర్శకత్వం వహించిన తండ్రులున్నారు. కానీ.. వందేళ్ల సినిమా చరిత్రలో తండ్రి సినిమాకు కూతురు దర్శకత్వం వహించిన ఘనత సౌందర్యకే దక్కింది. పుట్టిన ప్రతివారు చరిత్రకారులు కాలేరు, చరిత్ర సృష్టించలేరు. కానీ రజనీకాంత్ మాత్రం చరిత్రకారుడు, చరితార్ధుడు కూడా’ అంటు రజినీని ఆకాశానికి ఎత్తేసారు. మరో అతిధిగా పాల్గొన్న రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ, తాను తీసిన ‘ ఈగ’ మూవీ ‘కొచ్చాడియన్’ ముందు వందవభాగానికి కూడా రాదని అంటు మరో బాంబు పేల్చాడు. ఇంతమంది ఇంత గొప్పగా పొగుడుతున్న ఈ సినిమా ట్రైలర్లు మాత్రం రజినీ అభిమానులను మెప్పించ లేకపోవడం లేటెస్ట్ ట్విస్ట్. ఏమైనా ఈ సినిమా భవితవ్యం వచ్చేనెల 9వ తారీఖున తేలనున్నది.   

మరింత సమాచారం తెలుసుకోండి: