ఎట్టకేలకు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ జంట లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే ఈ జంట యంగ్ పెయిర్ కాకపోయినా, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రేమ జంట. వీరిద్దరే ఆదిత్య చోప్ర, రాణి ముఖర్జీ. ఆదిత్య చోప్ర, రాణి ముఖర్జీ ఇద్దరూ ఇటలీలో మ్యారేజ్ చేసుకొని, అఫిషియల్ ప్రెస్ మీట్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ శుభసందర్భంలో రాణి ముఖర్జీకు , అధిత్య చోప్ర ఓ అపురూపమైన కానుకను అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగీ మీకు అందిస్తుంది. ఈ న్యూస్ ను తెలుసుకున్న బిటౌన్ ఇండస్ట్రీ నింజగానే ఆశ్ఛర్యపడుతుంది. రాణి ముఖర్జీను లక్కీగర్ల్ అంటుంది. రాణి ముఖర్జీకు ఆధిత్య చోప్ర నలభై కోట్ల రూపాయల విలువైన విల్లాను గిప్ట్ గా ఇస్తున్నాడు. తన జీవితంలోకి వచ్చిన రాణీ ముఖర్జీకు తను ఎంతో రుణపడి ఉంటాను అంటూ ఓ మెసేజ్ ను పంపి, ఆ గిప్ట్ ను తనకు బహుకరిస్తున్నట్టు బిటౌన్ మీడియా అంటుంది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరి మ్యారేజ్ పై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ , మరి కొంత మంది నుండి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతుంది. ఏదేమైనా యష్ రాజ్ ఫ్యామిలి మాత్రం వీరిద్దరి మ్యారేజ్ ను సంపూర్తిగా ఆహ్యానించింది. మొత్తంగా ఆధిత్య చోప్ర, రాణి ముఖర్జీకు చాలా విలువైన బహుమతిని అందిస్తున్నాడని బిటౌన్ అంటుంది. ఇక నుండి వీరిద్దరు అఫిషియల్ గా పలు ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నారు. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లోనూ రాణి చోప్ర ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని బిటౌన్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: