విక్టరి వెంకటేష్ నయనతారపై కోప్పడ్డాడు అనే న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన సమాచరాం మేరకు విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించబోతున్న ఓ మై గాడ్ తెలుగు రిమేక్ లో వెంకటేష్ సరసన నయనతారను సెలక్ట్ చేసింది చిత్ర యూనిట్ . అయితే రీసెంట్ రాధా అనే మూవీలోనూ వెంకటేష్ సరసన నయనతారనే హీరోయిన్ గా నటిస్తుంది. ఆ మూవీ ప్రసుత్తం మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నయనతారకు కోసం వచ్చిందట. మళ్ళీ వెంకటేష్ సరసన అంటే తనుకు నటించే ఉద్ధేశం లేదని తన పి.ఆర్ కు చెప్పిందట. నయనతార పి.ఆర్ వచ్చి, ఓ మై గాడ్ తెలుగు మూవీ రిమేక్ లో నయనతార నటించడం లేదని నిర్మాతలకు చెప్పేశాడు. అసలు కారణం తెలుసుకున్న నిర్మాతలు ఈ విషయాన్ని వెంకటేష్ కు వివరించారు. దీంతో వెంకటేష్, నయనతారల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాలీవుడ్ టాక్. అయితే ప్రస్తుతం ఓ మై గాడ్ తెలుగు రిమేక్ లో నయన తారను మార్చి, కోడిరామ క్రిష్ణ దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిల్మ్ అవతారంలో నటించిన రాధిక అనే హీరోయిన్ ను, వెంకటేష్ సరసన సెలక్ట్ చేశారు. పైకి మాత్రం నయనతార తో రెమ్యునరేషన్ కుదరక వెంకటేష్ సరసన నటించడంలేదనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, అసలు నిజం ఏంటో టాలీవుడ్ లో బాహాటంగానే వినిపిస్తుంది. ఇలా అయితే నయనతార ఇక తెలుగులో నటించే ఉద్ధేశంలో లేదనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: