మెగా హీరో అల్లు అర్జున్ నటించిన, లేటెస్ట్ గా రిలీజ్ అయిన తన మూవీతో సంచలన రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అల్లుఅర్జున్ నటించిన రేసుగుర్రం మూవీ కలెక్షన్స్ పరంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటికే యాభై కోట్ల రూపాయల మార్క్ చేరుకుందని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే నైజాం లోనూ అల్లుఅర్జున్ ఎన్నడూ లేని విధంగా కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాడు. నైజాలో ధుమ్మురేపే కలెక్షన్స్ ను కొల్లగొట్టాలంటే అది ఇద్దరికే సాధ్యం అంటూ టాలీవుడ్ చెబుతుంటుంది. ఒకటి మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ అయితే, రెండోది ప్రిన్స్ మహేష్ బాబుది. దాదాపు వీరిద్దరి మూవీలే ఇప్పటి వరకూ నైజాంలో 15 కోట్ల రూపాలయ కలెక్షన్స్ వరకూ సాధించారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు అల్లుఅర్జున్ కూడ ప్లేస్ ను సంపాదించుకున్నాడు. మహేష్ బాబు నటించి దూకుడు, సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు మూవీలు నైజాంలో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి. అలాగే పవన్ కళ్యాణ్ నటించని గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూవీలు నైజాంలో 15 కోట్ల రూపాయలను కలెక్షన్ష్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో అల్లుఅర్జున్ చేరిపోయాడు. అల్లుఅర్జున్ నటించిన రేసుగుర్రం మూవీ నైజాంలో దాదాపు 15 కోట్ల రూపాయల మార్క్ ను చేరుకుందటి ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: