కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఒకనాటి మెగా స్టార్ చిరంజీవికి బుధవారం ఓటు హక్కు వినియోగించునేందుకు వచ్చిన సమయంలో పలువురు ఓటర్లు చిరంజీవికి దిమ్మ తిరిగే షాక్ యిచ్చారు. ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఇంటర్నేషనల్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన భార్య, తనయుడు రామ్ చరణ్ తేజ, కోడలితో కలిసి వచ్చారు. చిరు మొదట క్యూలైన్లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి మంత్రి హోదాలో దూసుకు వెళ్ళిపోతుoటే అక్కడే క్యూ లైన్ లో ఉన్న పలువురు స్థానిక ఓటర్లు దీనిపై అభ్యంతం తెలియ చేయడంతో షాక్ గురి అయిన చిరంజీవి ఇంక విధిలేని పరిస్థుతులలో వెనక్కి తిరిగి వచ్చి క్యూలైన్లో నిలబడి ఓటు వేసారు. ఐదేళ్ళకు ఒకసారి సామాన్యుడిని అసామాన్యుడిగా సింహాసనంలో కూర్చో పెట్టె ఈ ఎన్నికల రోజు అయినా చిరంజీవి సామాన్యుడిని గుర్తించకపోవడం ఆశ్చర్యకరం. ఇది ఇలా ఉంటే ఇదే కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం క్యూలో నిలబడి తన ఓటును వేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: