ఈ మధ్యన తరుచు కమల్ తో ఒక సినిమా ఓకే అయిందంటూ దర్శకుడు తేజా మీడియాకు లీక్స్ ఇవ్వడంతో ఆవార్త నిజమే అని అనుకున్నారు అంతా. అంతే కాదు వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు చేస్తున్న తేజా దగ్గర కమల్ ను ఒప్పించే స్థాయి కధ ఉందా అంటూ అందరూ ఆశ్చర్య పోయారు.  అయితే కమల్ ఈవార్తల పై స్పందించాడు. అంతేకాదు తాను నటించడానికి ఏ తెలుగు దర్సకుడికీ మాట ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే తను కొంత మంది తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్న విషయం వాస్తవమేననీ, వాటిల్లో ఏదీ ఫైనలైజ్‌ కాలేదని ఈ విలక్షణ హీరో చెపుతున్నాడు. తెలుగులో తన సొంత బేనరు రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌లోనే ఒక సినిమా చేస్తాను అని అంటు 20 ఏళ్ల తరువాత తాను నటించే తెలుగు సినిమా కాబట్టి ఆ కధ తనకు బాగా నచ్చాలి అని అంటున్నాడు ఈ విశ్వనటుడు. ఇది ఇలా ఉండగా కమల్‌హాసన్‌ చిత్రాలు ఏకంగా మూడు ఈ ఏడాది విడుదల కావడం సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న విశ్వరూపం-2, ఉత్తమ విలన్, సినిమాలు నిర్మాణం ఇంచుమించు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతూ ఉంటే మలయాళంలో సంచలనం రేపిన ‘దృశ్యం’ సినిమాను కూడ కమల్ తమిళంలో రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో మీనా పాత్రను గౌతమి పోషించబోతోంది. ఏమైనా కమల్ మీడియాకు చెప్పిన విషయాలు తేజాకు గట్టి షాక్ అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: