మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమా రీమేక్ శ్రీప్రియ దర్శకత్వంలో ఒకప్పటి హిట్ పైర్ వెంకటేష్ మీనాలు కలిసి నటిస్తున్న ‘దృశ్యం’ మూవీ సెన్సార్ నిన్న జరిగింది. ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిoది. దీనితో ఈ సినిమా జూలై 11న వరల్డ్వైడ్గా విడుదలకావడానికి రంగం సిద్ధం అవుతోంది.
ఎన్నో కుటుంబ చిత్రాలను చూసిన తమకు ఈ సినిమా చాలా భిన్నంగా కనిపించిందని అంతేకాక ఈ సినిమా చూసి థ్రిల్ అయ్యామని సెన్సార్ సభ్యులు చెపుతున్నారని ఇప్పటివరకు తమ బేనర్లో వచ్చిన కుటుంబ కథా చిత్రాలు అన్నీ సూపర్హిట్ అయ్యాయి కాబట్టి ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నిర్మాత సురేష్ బాబు అభిప్రాయం.
అయితే ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ నటన పూర్తి పరిపక్వత కనిపించలేదని అదేవిధంగా దర్శకురాలు శ్రీప్రియ ఈ సినిమాను మలయాళ సినిమాకు పూర్తి కాపీ అండ్ పేస్ట్ సినిమాగా మలిచారని సినిమా సన్నివేశాల చిత్రీకరణలో తెలుగు నేటివిటీ మిస్ అయిందని కొందరు సెన్సార్ సభ్యులు గుసగుసలు ఆడుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈసినిమాలో కామెడీ ట్రాక్ మిస్ కావడం ఈ సినిమా విజయం పై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఎదిఎమైనా ఈమధ్య విడుదల అయిన అక్కినేని కుటుంబ సినిమా ‘మనం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో ‘దృశ్యం’ కూడ సూపర్ హిట్ అయితే మరిన్ని కుటుంబ సినిమాలు వచ్చే అవకాసం ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: