విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వారంలో రాబోతున్న ‘అల్లుడు శీను’ సినిమా పై ఆశక్తికర కామెంట్స్ చేసాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నానని ఆ సినిమాలో తన పాత్ర సీక్రెట్ తెలియ చేసాడు. ఈ సినిమా ఆడియో వేడుకకు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడుదామని అనుకున్నా వీలు పడకపోవడంతో కాస్త ఆలస్యంగా అయినా మీడియా ముందుకు వచ్చానని చెపుతున్న ప్రకాష్ రాజ్ నిన్న ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. వినాయక్‌తో 'దిల్‌' సినిమా నుంచి తనకు కొనసాగుతున్న స్నేహం గురించి ప్రస్తావించి ‘అల్లుడు శీను’ లాంటి కధను సినిమాగా తీయాలి అంటే దర్శకుడికి చాల తెలివి తేటలు ఉండాలి అంటూ వినాయక్ ను ఆకాశానికి ఎత్తేశాడు ప్రకాష్ రాజ్. తాను ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించినా ‘అల్లుడు శీను’ లాంటి వెరైటీ కధను తాను ఇప్పటి వరకు వినలేదు అని అనడం మీడియాకు షాకింగ్ గా మారింది.  ఇక ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ రానున్న కాలంలో శ్రీనివాస్ టాప్ యంగ్ హీరోగా మారతాడు అని జోష్యం చెప్పాడు ప్రకాష్ రాజ్. ఇన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టే కాబోలు ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ కేవలం ఈ సినిమా పబ్లిసిటీకే 2 కోట్లు ఖర్చు పెట్టడటం ప్రస్తుతం టాలీవుడ్ కు సంచలనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: