ప్రస్తుతం తన 150వ సినిమా గురించి ఆలోచిస్తూ దర్శకులతో చెస్ గేమ్ ఆడుతున్నచిరంజీవి నాగార్జునను అనుసరిస్తూ బుల్లి తెర పై వచ్చేనెల మొదటి వారంలో హడావిడి చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బాగా పాపులర్ అయ్యాక చిరంజీవి చేత కూడ బుల్లి తెర పై ఒక టాక్ షో ను ఒక ప్రాముఖ ఛానల్ ప్లాన్ చేస్తోంది అనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. అయితే చిరంజీవి ఈ ప్రతి పాదనకు ఇష్ట పడకపోవడంతో ఆ టాక్ షో ప్రపోజల్ మధ్యలో ఆగిపోయింది అనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే చిరంజీవిని బుల్లితెర పై చూడాలనుకున్న చిరూ అభిమానుల కోరిక తీరబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్యలహరి’ ప్రొగ్రాంలో చిరంజీవి గెస్ట్‌గా వస్తున్నారని, ఇది ఆగస్ట్ 3న టెలికాస్ట్ అవుతుందని సమాచారం. మరోవైపు నాగార్జున హిట్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు‌లో కూడ చిరంజీవి అతిధిగా వచ్చి సందడి చేస్తాడనే వార్తలు మరో వైపు వినిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రాం కూడా ఆగస్ట్ 3 నే ప్రసారం కానుందని టాక్. ఈ రెండు ప్రోగ్రాంల షూటింగ్స్‌లో చిరంజీవి హడావిడిగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక వైపు రాఘవేంద్రరావుతో మరో వైపు నాగార్జునతో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ రెండు కార్యక్రమాలలోను చిరంజీవి అతిధిగా మెరవబోతున్నాడు అని అంటున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజు వేరు వేరు ఛానల్స్ లో ఒకే రోజు వస్తే అది బుల్లితెర సంచలనమే అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: