బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే రణ్ భీర్ కపూర్. గత కొంత కాలంగా రణ్ భీర్ చాలా కామ్ అండ్ గోయింగ్ పద్దతిలో ఉన్నాడు. ఎందుకంటే రణ్ భీర్ కపూర్, కత్రినా కైఫ్ ల వ్యవహారం అందరికి ఓపెన్ గా తెలిసిపోవడంతో మీడియా సైతం వీరు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి కలిసి వెళ్ళినా పెద్దగా పట్టించుకోవడంలేదు. అలాగే వీరు త్వరలోనే మ్యారేజ్ చేసుకోవడం ఖాయం అనే టాక్స్ కూడ బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రణ్ భీర్ కపూర్ తీసుకున్న నిర్ణయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రణ్ భీర్ కపూర్ తన లవర్ తో నటించాల్సిన మూవీలో మరో హీరోయిన్ కి ఆ ఆఫర్ ఇచ్చాడు. ఇందంతా మూవీకి సంబంధించిన వ్యవహారంలో చివరి నిముషంలో హీరోయిన్ ని రణ్ భీర్ కపూర్ మార్చినట్టుగా బాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. రణ్ భీర్ కపూర్ త్వరలోనే కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ మూవీని చేయబోతున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ లో రాబోతున్న ఆ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీలో రణ్ భీర్ కపూర్ సరసన కత్రినాకైఫ్ నటించాల్సి ఉంది. దీనికి సంబంధించిన టాక్స్ సంవత్సర క్రితమే ఫైనల్ అయినట్టుగా గతంలో కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ ని కరణ్ జోహార్ ట్విట్టర్ లో పెట్టాడు. రణ్ భీర్ కపూర్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఆఫర్ ని రణ్ భీర్ కపూర్ స్వయంగా అలియాభట్ కి ఇచ్చాడు అని చెప్పటంలో అసలు వ్యవహారం బయటపడింది. కత్రినాకైఫ్ ని రణ్ బీర్ కపూర్ దూరం పెట్టడంలో ఉన్న కారణం ఏంటో మీడియాకి అర్ధం అయింది. గత కొంత కాలంగా రణ్ భీర్ కపూర్, అలియా భట్ లు డేటింగ్ లో ఉన్నారని, అందుకే అలియా భట్ కి ఈ ఆఫర్ వరించిందని బిటౌన్ మీడియా అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: